Secunderabad Mahankali Rangam 2026 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి. జాతరలో అత్యంత కీలకమైన, భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది.

పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే స్వర్ణలత చెప్పే భవిష్యవాణిని వినేందుకు భక్తులు, నేతలు, అధికారులు భారీ సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు.
భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత ప్రజలను, పూజారులను ఉద్దేశించి పలు కీలక హెచ్చరికలు చేశారు. "ఎన్ని ఆపదలు, ప్రమాదాలు వచ్చినా ప్రతిక్షణం ప్రజలను నేనే కాపాడుకుంటున్నాను. కానీ మీరు నా మాటను ఏమాత్రం ఆచరించడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో మూలాలను మర్చిపోతున్నారన్న ఆమె…. "మనుషులు వావివరుసలు లేకుండా ఘోరాలకు ఒడిగడుతున్నారు. అలాంటి వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నాకు సంతోషం లేకుండా చేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాల గురించి వివరిస్తూ… ఈ ఏడాది తీవ్రమైన వర్షాలు కురుస్తాయని స్వర్ణలత స్పష్టం చేశారు. "ఈ ఏడాది కుంభవృష్టిగా వర్షాలు పడతాయి. ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం కుంభవృష్టి మాత్రమే కాదు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వర్ష తీవ్రతకు ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది," అని ప్రజలను అప్రమత్తం చేశారు.
నాకు కంటతడి పెట్టిస్తున్నారు…
సమాజంలో మానవ సంబంధాలు, ఆధ్యాత్మికత తగ్గిపోతుండటంపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని స్వర్ణలత తెలిపారు. "ప్రజల్లో అహంకారం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే అందరికీ మంచిది. ఈ ఏడాది నన్ను చాలా బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}సమాజంలో మానవ సంబంధాలు, ఆధ్యాత్మికత తగ్గిపోతుండటంపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని స్వర్ణలత తెలిపారు. "ప్రజల్లో అహంకారం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే అందరికీ మంచిది. ఈ ఏడాది నన్ను చాలా బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన ధార్మిక కార్యక్రమాలపై స్పందిస్తూ, "నాకు విగ్రహ ప్రతిష్ట చేస్తే భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. కానీ రాబోయే ఆరు నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే మాత్రం తీవ్ర ప్రాణనష్టం తప్పదు" అని హెచ్చరించారు.