రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తుండగా… ఆయన్ను తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త గవర్నర్ శివపత్రాప్ శుక్లా నేపథ్యం…
- కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్ 1న ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ జిల్లా రుద్రాపుర్ గ్రామంలో జన్మించారు.
- రుద్రాపుర్లో ప్రాథమిక విద్య, గోరఖ్పుర్లో కాలేజీ విద్య పూర్తిచేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
- చదువుకునే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు.
- 1983లో శివపత్రాప్ శుక్లా భారతీయ జనతా పార్టీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్పుర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
- 1991లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు.
- 1993, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు 1996లో కల్యాణ్సింగ్, రామ్ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్ల ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేశారు. 2
- 2016లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
- 2017లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- 2023 ఫిబ్రవరిలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}