ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ – శ్రీగంగానగర్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఈ రూట్లో సేవలు అందుకోవచ్చు. ఉత్తరభారతం వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రైలు నెంబర్ 07053/07054తో నడిచిన స్పెషల్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే పొడిగించింది. ఈ కొత్త సర్వీసులు జూలై నెలలో నడవనున్నాయి.
కాచిగూడ-శ్రీగంగానగర్ ట్రైన్స్ షెడ్యూల్

ట్రైన్ నంబర్ 07053 (కాచిగూడ - శ్రీగంగానగర్) ఈ రైలు జూలైలో రెండు సర్వీసులు నడవనుంది. 11.07.2026 రోజున శనివారం కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరో ట్రైన్ 18.07.2026న కాచిగూడ నుంచి వెళ్తుంది.
ఇక ట్రైన్ నంబర్ 07054 (శ్రీగంగానగర్ - కాచిగూడ ) రైలు 14.07.2026 మంగళవారం రోజున శ్రీగంగానగర్ నుంచి పయనమవుతుంది. ఇంకోటి 21.07.2026న అక్కడ నుంచి కాచిగూడ వస్తుంది.
మెుత్తం నాలుగు సర్వీసులు నడవనున్నాయి. ఈ రైలుకు సంబంధించిన అదనపు సమాచారం, సీట్ల లభ్యత, టికెట్ బుకింగ్ వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్సైట్ ను చూడొచ్చు. లేదా దక్షిణ మధ్య రైల్వే అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాద్-వాడి రైళ్లు
కొత్తగా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది. ఇవి అన్రిజర్వ్డ్ ట్రైన్స్ అని స్పష్టంగా చెప్పింది. సాధారణ ప్రజలు ఈ రూట్లో హాయిగా ప్రయాణించవచ్చు. మెుత్తం 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 29వ తేదీన ఈ రైళ్లు ప్రారంభమవుతాయి.
రైళ్ల షెడ్యూల్
07175 హైదరాబాద్-వాడి మధ్య రైలు జూన్ 29వ తేదీన సోమవారం హైదరాబాద్లో ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. వాడికి మధ్యాహ్నం 2.30కి చేరుకుంటుంది.
{{/usCountry}}07175 హైదరాబాద్-వాడి మధ్య రైలు జూన్ 29వ తేదీన సోమవారం హైదరాబాద్లో ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. వాడికి మధ్యాహ్నం 2.30కి చేరుకుంటుంది.
{{/usCountry}}07176 వాడి-హైదరాబాద్ మధ్య జూన్ 29వ తేదీన వాడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
07175 హైదరాబాద్-వాడి మధ్య జూలై 1వ తేదీన బుధవారం ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. ఉదయం పది గంటలకు వాడి చేరుకుంటుంది.
అలాగే 07176 నెంబర్ రైలు వాడి-హైదరాబాద్ నడుమ జూలై 1న ఉదయం 11.40కి బయల్దేరుతుంది. సాయంత్రం 4.35కి హైదరాబాద్ చేరుకుంటుంది.
రైళ్లు ఆగే స్టేషన్లు
22 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ఈ ట్రైన్ ఉంటుంది. పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. బేగంపేట, సనత్నగర్, హఫీజ్పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకర్పల్లి, గుళ్లగూడ, వికారాబాద్, గొడమూర్గ, ధరూర్, రూక్మాపూర్, తాండూర్, మంతట్టి, నవాంద్గి, కుర్కుంట, సెడం, మళ్ఖేడ్ రోడ్, చిత్తాపూర్ స్టేషన్లలో ఆగుతుంది.