Hyderabad techie Seetharam suicide Case : హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసును బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య రేణుక వ్యవహరించిన తీరుతోనే సీతారాం రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అసలేం జరిగింది…?
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి(36) మృతదేహం హుస్సేన్ సాగర్ లో లభ్యమైంది. తొలుత సాధారణ ప్రమాదం లేదా ఆత్మహత్యగా భావించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు… కోడలు రేణుకపై తీవ్ర ఆరోపణలు చేయడంతో కేసును బాచుపల్లి పోలీసులకు బదిలీ చేశారు. సీతారాం తండ్రి వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు సజావుగానే సాగిన వీరి సంసారంలోకి మూడో వ్యక్తి ప్రవేశించడంతో గొడవలు మొదలయ్యాయి.
సీతారాం భార్య రేణుకకు ఎం. రమణారెడ్డి అనే వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ ఏడాది జనవరిలో రేణుక ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీనిపై సీతారాం రెడ్డి తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఆమె తన ప్రియుడితోనే ఉన్నట్లు తెలుసుకున్న సీతారాం తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనయ్యారు.
ప్రైవేట్ వీడియోలు.. మానసిక వేదన
సీతారాం తండ్రి వెంకటేశ్వర్ చేసిన ఆరోపణలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రేణుకకు సంబంధించిన సన్నిహిత వీడియోలు తన కొడుకు సీతారాం దృష్టికి వచ్చాయని…. ఇది అతడిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసిందని ఆయన తెలిపారు. తన భార్య పరాయి వ్యక్తితో ఉన్న వీడియోలను చూడటం, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సీతారాం….. ఇక తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
{{/usCountry}}సీతారాం తండ్రి వెంకటేశ్వర్ చేసిన ఆరోపణలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రేణుకకు సంబంధించిన సన్నిహిత వీడియోలు తన కొడుకు సీతారాం దృష్టికి వచ్చాయని…. ఇది అతడిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసిందని ఆయన తెలిపారు. తన భార్య పరాయి వ్యక్తితో ఉన్న వీడియోలను చూడటం, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సీతారాం….. ఇక తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
{{/usCountry}}ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద…. ఏప్రిల్ 21న పోలీసులు రేణుక ఆమె ప్రియుడు రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
వెలుగులోకి లేఖ…!
ఈ కేసులో సీతారాం రాసిన 19 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను బుద్ధి మార్చుకోమని కోరినా వినలేదని…. మరింత రెచ్చిపోయిందని పేర్కొన్నాడు. పెళ్లైన తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగించిందని ప్రస్తావించాడు. పైగా వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలను.. తన భార్య రమణారెడ్డికి షేర్ చేసిందని సీతారాం సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు. అయితే రేణుక ప్రియుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పేర్కొన్నాడు.ఈ విషయం తనని ఎంతో మానసిక వేధనకు గురిచేసిందని నోట్ లో రాశాడు.
తన భార్యకు ఎలాంటి లోటు చేయలేదని… కానీ ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని తన లేఖలో సీతారాం రాసుకొచ్చాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సీతారాంకు.. నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ కుమారుడు సీతారామ్ ఆత్మహత్యకు కారణమైన రేణుకతో పాటు రమణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.