తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు-2026'ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఉన్న పిల్లలు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకునేలా చూడటమే ఈ బిల్లు లక్ష్యం. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఖజానా నుండి జీతాలు పొందుతున్న ఇతర సంస్థల ఉద్యోగులు తమ తల్లిదండ్రులను చూసుకోవడంలో విఫలమైతే, వారి జీతంలో 15 శాతం కోత విధిస్తారు. ఈ కోతను నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.
సహాయం కోరుకునే తల్లిదండ్రులు ఒక ప్రత్యేక అధికారికి, సాధారణంగా జిల్లా కలెక్టర్కు, అధికారిక దరఖాస్తును సమర్పించవచ్చు. కేసును సమీక్షించి, తగిన ఆర్థిక భత్యాన్ని నిర్ణయిస్తారు. ఈ కోత ఉద్యోగి జీతంలో 15 శాతం లేదా నెలకు రూ. 10,000, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. దరఖాస్తులను తల్లి, తండ్రి విడివిడిగా లేదా ఉమ్మడిగా సమర్పించవచ్చు. అధికారి 60 రోజులలోపు ఈ విషయాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.
ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భాలలో తల్లిదండ్రులు పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తికి అప్పీల్ చేసుకోవచ్చు. జవాబుదారీతనం, నిబంధనల పాటించడాన్ని నిర్ధారించడానికి ఆ న్యాయమూర్తి రాష్ట్రస్థాయిలో కమిషనర్గా వ్యవహరిస్తారు. ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను తీసుకొనివస్తూ.. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తిని మెుత్తం.. ధారపోస్తారని అన్నారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చిన తర్వాత.. తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని చెప్పారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవడానికి ఈ చట్టం తెచ్చామని చెప్పారు.
వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర చట్టం ప్రకారం.. తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదన్నారు. సమాజం తలదించుకునేలా.. కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు సీఎం. ఆత్మీయతకు సంబంధించి.. అంశం మీద చట్టం తేవడం చాలా బాధకరమని చెప్పారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తులను సామాజికంగా బహిష్కరించాలన్నారు. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు.. సమాజంలో బతికేందుకు వీల్లేదని పేర్కొన్నారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని, ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
{{/usCountry}}వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర చట్టం ప్రకారం.. తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదన్నారు. సమాజం తలదించుకునేలా.. కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు సీఎం. ఆత్మీయతకు సంబంధించి.. అంశం మీద చట్టం తేవడం చాలా బాధకరమని చెప్పారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తులను సామాజికంగా బహిష్కరించాలన్నారు. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు.. సమాజంలో బతికేందుకు వీల్లేదని పేర్కొన్నారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని, ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
{{/usCountry}}