ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వటంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అవుతుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంతో పాటు బీసీ రిజర్వేషన్లపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనుంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటానేది ఆసక్తికరంగా మారింది.
అజెండాలో కీలకాంశాలు…!
ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పలు మార్గాలను ఎంచుకుంది. కానీ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దన్న పరిమితులు ఉండటంతో… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వపరంగా కుదురకపోవటంతో… పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించే అంశాన్ని అధికార కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం..!
ఇక ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కూడా సతకం అయింది. ఇందుకు సంబంధించిన ఆమోదించి… ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ కేబినెట్ నిర్ణయం ఉండనుంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించింది.ఆసక్తి వ్యక్తం చేసిన టెండర్లకు సైతం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా నీటిపారుదల శాఖకు సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి.