వరంగల్‌ విమానాశ్రయంపై మరో ముందడుగు - ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

వరంగల్ మామునూరు ఎయిర్​పోర్టులో మరో అడుగు ముందుకు పడింది.  భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయగా…  300 ఎకరాల భూములను ఎయిర్ పోర్టు అథారిటీకి అప్పగించింది. 

Published on: Jan 30, 2026 11:42 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరంగల్ ఎయిర్ పోర్టు పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. కీలకమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే పూర్తి చేసింది. దీంతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయింది. అయితే 300 ఎకరాల భూసేకరణకు సంబంధించిన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానా

ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది. గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ‘వింగ్స్‌ ఇండియా’ కార్యక్రమంలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుకు ఈ భూముల పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. రూ.850 కోట్లతో మామునూరు విమానాశ్రయం రన్‌వే, ఆధునిక టెర్మినల్‌ భవనాల నిర్మాణం చేపట్టామని.. రెండేళ్లలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు - డిప్యూటీ సీఎం

“వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన ఈ క్షణం తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ. 300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాము” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

వీలైనంత త్వరలో శంకుస్థాపన - మంత్రి పొంగులేటి

భూసేకరణ పత్రాలు అప్పగింత కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూాడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉందన్నారు. అందుకే ఈ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా మూడు ఎయిర్‌పోర్ట్ లను ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు కావడం ఎంతో గర్వకారణమని చెప్పుకొచ్చారు.

“ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల కోరికైన ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు శాసనసభ్యులు అక్కడ రైతులందరిని ఒప్పించి పూర్తి సహకారంతో ఎయిర్ పోర్ట్ భూములను ఇప్పించడం జరిగింది. వీలైనంత తొందరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని కోరడం జరిగింది” అని మంత్రి పొంగులేటి తెలిపారు.

“రాష్ట్రంలో ఇంకా కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుల రిక్వైర్మెంట్ అంశం పెండింగ్ లో ఉంది. కేంద్రం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా కేంద్రమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. అనుమతులు వచ్చిన తర్వాత వాటికి అవసరమైన భూములను అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలపడం జరిగింది” అని మంత్రి పొంగులేటి తెలిపారు.