Telangana Govt : ఇక RTO ఆఫీస్ తో పనిలేదు... షోరూమ్ వద్దే 'వెహికల్' రిజిస్ట్రేషన్, కొత్త మార్పులివే
కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన రిజిస్ట్రేషన్ ప్రకియ మరింత సులభతరం కానుంది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే… డీలర్ షో రూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా… రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్…
డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను 15 రోజుల్లో పూర్తి చేయాలని రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ను(టీఆర్) డీలర్ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.
తప్పనున్న తిప్పలు…
ఈ క్రమంలో ఆర్టీవో కార్యాలయాల వద్ద కొందరు డబ్బులు దండుకునే పనిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులను తీసుకుని పని పూర్తి చేస్తున్నారు. డీలర్లతో పాటు ఆర్టీవో అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ…పని కానిస్తున్నారు. పైగా ఆర్టీవో కార్యాలయాల్లో కూడా ముడుపులు ఇస్తేనే పనులు అవుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం…. ఈ వ్యవస్థలకు చెక్ పెట్టాలని గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల కిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఈ విషయాలపై సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ అధికారులకు కూడా కీలక ఆదేశిలిచ్చారు
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో… రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర రవాణశాఖ అడుగు ముందుకేసింది. డీలర్ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.
రవాణాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

