TG Indiramma Bima Scheme : తెలంగాణ సర్కార్ కొత్త స్కీమ్ - రూ.5 లక్షల ఉచిత బీమా..! త్వరలోనే మార్గదర్శకాలు
Telangana Indiramma Bima Scheme : కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా అందించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది, దీని విధివిధానాలపై ఖ
Telangana Indiramma Bima Scheme : రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. పేద కుటుంబాల్లో ఆకస్మికంగా సంభవించే విపత్తుల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల భారీ జీవిత బీమా సదుపాయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా కల్పించబోతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం…. తెలంగాణవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా, ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.
- రూ.5 లక్షల ఉచిత బీమా : ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే… ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది.
- ప్రీమియం భారం లేదు : సాధారణంగా జీవిత బీమా పాలసీలకు ప్రతి ఏటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
- 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని అణగారిన వర్గాల వరకు దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది.
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఈ స్కీమ్ పట్టాలెక్కనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ స్కీమ్ ను ప్రారంభించే అవకాశం ఉంది.
గ్రామ సభలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా పారదర్శకంగా అర్హులైన కుటుంబాల డేటాను సేకరించి, ఈ ఉచిత బీమా కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

