TG Engineering Colleges : ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజులు ఖరారు - టాప్ 10 కాలేజీల లిస్ట్ ఇదే
Engineering Colleges in Telangana : రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారయ్యాయి. కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జీవోను జారీ చేసింది. అత్యధికంగా CBITకి ఫీజు రూ.1.83 లక్షలుగా నిర్ణయించారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈసారి కాలేజీల ఫీజుల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జీవో(6) జారీ చేసింది.

ట్యూషన్ ఫీజులు ఖరారు…
రాష్ట్రంలో ఉన్న 160 ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను ఖరారు చేసింది. ఈ నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కు ఈ నిర్ణయం వర్తిస్తుంది. అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్టియర్లో చేరినవారికి ఈ ఫీజులనే వర్తిస్తాయి. అత్యధికంగా CBITకి ఫీజు రూ.1.83 లక్షలుగా నిర్ణయించింది.
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజల విషయంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అన్ని అంశాలను క్రోడీకరించి… ప్రభుత్వానికి పలు సిఫార్సులను అందజేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన సర్కార్…. తాజాగా 160 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 ప్రైవేటు కాలేజీల్లో అత్యధికంగా సీబీఐటీలో 1.83 లక్షల ఫీజును నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి ఇంజినీరింగ్ కళాశాల రెండో స్థానంలో నిలిచింది.
- సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ.45 వేల ట్యూషన్ ఫీజు ఉంది.
- రాష్ట్రవ్యాప్తంగా 126 ప్రైవేట్ కాలేజీల్లో లక్షలోపే ఫీజును ఫైనల్ చేశారు.
- 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షకు పైగా ఫీజు ఉంది.
- రూ.లక్ష ఫీజు ఉన్న కళాశాలల సంఖ్య అప్పట్లో ఏడుగా ఉండగా… ప్రస్తుతం 2కి తగ్గింది.
- 19 కాలేజీలకు ఇప్పటివరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించడంతోపాటు 70 కళాశాలలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- కనీస ఫీజు రూ.45 వేలు ఉండగా.. 21 కళాశాలలకు ఆ రుసుమును ఖరారు చేశారు.
- తాజాగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.
- ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించిన తర్వాత ఒకవేళ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.
అత్యధిక ఫీజులు - టాప్ కాలేజీలు..
- సీబీఐటీ - రూ. 1,83,000
- వాసవి ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,75,000
- ఎంజీఐటీ - రూ. 1,67,000
- సీవీఆర్ - రూ.1,63,000
- జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,62,000
- గోకరాజు గంగరాజు - రూ.1,60,500
- VNR విజ్ఞాన జ్యోతి రూ.1,59,600
- కిట్స్ - రూ.1,46,200
- బీవీరాజు ఇనిస్టిట్యూట్ రూ.1,46,600
- MVSR ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,43,800
- బీవీఆర్ఐటీ విమెన్ - రూ 1,43,500
- ఎస్ఆర్ - రూ. 1.41 లక్షలు
- వర్ధమాన్ - రూ.1.40 లక్షలు
ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా…. వీలును బట్టి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర విరాళాల పేరుతో అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











