హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న చర్చలు, ప్రక్రియలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. నిర్మాణ భాగస్వామి అయిన ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది.
రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ అయింది. మార్చి 31ని మెట్రో స్వాధీన తేదీ అని మెుదటగా అనుకున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించిన విషయం తెలిసిందే.
ఒప్పందం వివరాలు
ఈ భారీ ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నడిచిన మెట్రో రైలు, ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
ఆలస్యానికి కారణం ఇదే
నిజానికి ఈ స్వాధీన ప్రక్రియను ఈ ఏడాది మార్చి 31 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం కోరింది. ఆ రుణ మంజూరు ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం కావడంతో, స్వాధీన గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించాల్సి వచ్చింది. తాజాగా నిధులు సమకూరడం, షేర్ల బదిలీ పత్రాలపై సంతకాలు పూర్తి కావడంతో ఈ బృహత్తర ప్రక్రియ ముగిసింది.
హెచ్ఎంఆర్ఎల్ ముఖ్య కార్యదర్శి, ఛైర్మన్ కె.రామకృష్ణ రావు, ఎల్ అండ్ టీ, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ సీనియర్ యాజమాన్యం సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. హెచ్ఎంఆర్ఎల్ తరఫున సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరపున డి.కె.సేన్, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ తరపున కె.వి.బి. రెడ్డి వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
{{/usCountry}}హెచ్ఎంఆర్ఎల్ ముఖ్య కార్యదర్శి, ఛైర్మన్ కె.రామకృష్ణ రావు, ఎల్ అండ్ టీ, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ సీనియర్ యాజమాన్యం సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. హెచ్ఎంఆర్ఎల్ తరఫున సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరపున డి.కె.సేన్, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ తరపున కె.వి.బి. రెడ్డి వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
{{/usCountry}}ఎల్ అండ్ టీ మెట్రో రైల్(హైదరాబాద్)లిమిటెడ్, మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్క్ పొడవుతో విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ను నవంబర్ 2017 నుండి నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థ ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 86 కోట్ల ప్రయాణాలను నమోదు చేసింది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనం
మెట్రో ప్రభుత్వం చేతుల్లోకి రావడం వల్ల రానున్న రోజుల్లో టికెట్ ధరల నియంత్రణ, మెట్రో విస్తరణ పనులు, రాయితీల విషయంలో ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఏ విధంగా చేపట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.