గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
Telangana Graduate MLC : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈనెల 20వ తేదీన పబ్లిక్ నోటీస్ ఇవ్వనుంది.
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, అలాగే వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు.

రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ గడువులను నిర్ణయించింది. ఈ నెల 20న నోటిఫికేషన్/పబ్లిక్ నోటీసు జారీ కానుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమై నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
నవంబరు 25న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు, సవరణలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి కచ్చితంగా కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సాధారణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఓటర్ల జాబితాలాగా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా శాశ్వతంగా ఉండదు. ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
ఈ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అభ్యర్థులు ఏదేనీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో CEO Telangana వెబ్సైట్ ద్వారా లేదా ఫారమ్-18 నింపి సంబంధిత తహసీల్దార్/ఆర్డీవో కార్యాలయాల్లో డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జతచేసి సమర్పించవచ్చు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి ప్రతినిధిగా ఉన్న పర్వతనేని వాణిదేవి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ల పదవీ కాలం వచ్చే మార్చి నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. తుది జాబితా విడుదలైన అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


