స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ - ప్రభుత్వం ఏం చేయబోతుంది…?

బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. నోటిఫికేషన్ కూడా నిలిపివేస్తున్నట్లు ఈసీ కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Published on: Oct 10, 2025, 11:28:31 IST
By , Telangana, Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను కూడా ఎత్తివేశారు.

స్థానిక ఎన్నికలు
స్థానిక ఎన్నికలు

ప్రభుత్వం ఏం చేయబోతుంది..?

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు జీవో 9పై కూడా హైకోర్టు స్టే ఇవ్వటంతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెకేట్ చేయించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా కాకుండా హైకోర్టులో కేసులో తేలే వరకు ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన కూడా చేయవచ్చు.

ఇలా కాకుండా… పాత రిజర్వేషన్లతోనే మరో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలను నిర్వహించే అవకాశం కూడా ఉంది. కానీ పాత రిజర్వేషన్లతోనే నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికలకు వెళ్తే బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణుంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చే ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలతో పాటు ప్రధాన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో చర్చ కూడా వినిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కోర్టుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో… పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. అయితే దీనిపై ఆ పార్టీ అధినాయకత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. 5,982 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీ), 585 జడ్పీటీసీ స్థానాలు ఉండగా… వీటన్నింటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయం కూడా దాటిపోయింది.

రాష్రంలోని గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ లో పదవీ కాలం గతేడాది జనవరి 31వతో ముగిసింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 జూన్ మాసంలోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వటంతో… ఎన్నికల ప్రక్రియను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More