టీజీ ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు క్లోజ్.. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే రావాలని తెలిపింది. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలను 25-02-2026 నుండి 18-03-2026 వరకు నిర్వహించనుంది. పరీక్షల సమయం ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా పరీక్షా కమిటీ(DEC) DIEO / నోడల్ ఆఫీసర్ కన్వీనర్గా, ఒకరు/ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్లు, ఒక సీనియర్.. జూనియర్ లెక్చరర్ సభ్యులుగా ఐపీఈ మార్చి-2026 నిర్వహణను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. మెుత్తం 1,495 ఎగ్జామ్స్ సెంటర్లలో పరీక్షలు జరుగుతాయి. మెుత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు.

జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా, పోలీసు సూపరింటెండెంట్, RJDIE, DIEO / నోడల్ ఆఫీసర్, ఒక సీనియర్ ప్రిన్సిపాల్ సభ్యులుగా ఒక జిల్లా స్థాయి హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లో ముగ్గురు సభ్యులు ఉంటారు. విద్య, పోలీసు, రెవెన్యూ శాఖల నుండి ఒక్కొక్కరు నియమించారు. మెుత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్య 75గా ఉన్నాయి.
పరీక్షా కేంద్రాలలో మాల్ప్రాక్టీస్ కార్యకలాపాలను నివారించడానికి సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్య-200గా ఉన్నాయి. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యారోగ్య, విద్యుత్, విద్య, పోస్టల్, డీఈఓలతో అన్ని జిల్లాలలో అన్ని విభాగ అధిపతులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షల సమయంలో అవసరమైన రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను అభ్యర్థించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కూడా అభ్యర్థించారు. DMHOలు వైద్య సహాయం అందించాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల అవసరాల కోసం ఒక నర్సు / ఏఎన్ఎం సిబ్బందిని నియమించాలని అభ్యర్థించారు.
ఇంటర్ పరీక్షలు-ముఖ్యమైన విషయాలు
- పరీక్షా షెడ్యూల్ మొత్తం సమయంలో అంటే ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను క్లోజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులను సమావేశంలో అభ్యర్థించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో తాగునీటి సౌకర్యాలు, గోడ గడియారాలు, ఫర్నిచర్ అందించారు.
- TGBIE నిబంధనల ప్రకారం దుష్ప్రవర్తనలు / అక్రమాలకు పాల్పడే అధికారులు / యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటారు.
- ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- పరీక్షా రోజులలో అన్ని DIEOలు, నోడల్ అధికారులతో (అంటే జిల్లా అధికారులు) వీడియో కాన్ఫరెన్స్/జూమ్ సమావేశాలు పరీక్షలు షెడ్యూల్ చేసిన అన్ని రోజులలో నిర్వహిస్తారు.
- రాష్ట్ర కంట్రోల్ రూమ్ టెలిఫోన్ నంబర్ 040-24655027 అండ్ ఐవీఆర్ ఫోన్ నంబర్ 9240205555తో పనిచేస్తుంది.
విద్యార్థులకు సూచనలు
- హాల్-టికెట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యార్థి మొబైల్ నంబర్కు లింక్ పంపారు. అది QR కోడ్ను కలిగి ఉంటుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అది విద్యార్థి పరీక్షా కేంద్రానికి నావిగేట్ అవుతుంది.
- అభ్యర్థులు తమ హాల్-టికెట్లలో సూచించిన వారి పేర్లు, మాధ్యమం, కనిపించే సబ్జెక్టులు మొదలైన వాటి కచ్చితత్వాన్ని ధృవీకరించుకోవాలి. ఏదైనా తప్పును చూస్తే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దానిని సరిదిద్దాలి.
- TGBIE జారీ చేసిన హాల్-టికెట్ లేకుండా ఏ అభ్యర్థినీ అనుమతించరు.
- అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు అంటే ఉదయం 08:00 గంటలకు పరీక్ష హాలులో హాజరు కావాలి. అభ్యర్థులు ఉదయం 08:45 నుండి 09:00 గంటల మధ్య ఓఎంఆర్లో తమ బయో-డేటాను చెక్ చేసుకోవాలి. ప్రశ్నపత్రం ఉదయం 09:00 గంటలకు విద్యార్థికి అందిస్తారు.
- హాల్ టిక్కెట్లు అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.inలో అందుబాటులో ఉంటాయి. కళాశాల లాగిన్లోనూ ఉంచుతారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల నుండి హాల్ టిక్కెట్లను తీసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


