...
...
Next Story

TG SET 2026 Notification : తెలంగాణ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - దరఖాస్తు తేదీలు, పూర్తి షెడ్యూల్‌ ఇదే!

TG SET 2026 Notification : తెలంగాణలోని డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే 'టీజీ సెట్ 2026' నోటిఫికేషన్ విడుదలైంది.ఆగస్టు 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.

Published on: Jul 28, 2026, 08:22:58 IST
Advertisement

TG SET 2026 Notification : రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన ‘తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష’ (TG-SET 2026) దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఆలస్య రుసుము తేదీలు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌తో పాటు పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది.

టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ -ముఖ్య తేదీలు:

  • ఆగస్టు 3, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
  • ఆగస్టు 30వ తేదీ వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ. 1500 ఆలస్య రుసుముతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చారు.
  • రూ. 2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తుకు చివరి అవకాశం కల్పించారు.
  • సర్పించి వివరాల్లో ఏవైనా తప్పులుంటే దిద్దుకునేందుకు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
  • సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/

తెలంగాణ సెట్ 2026
తెలంగాణ సెట్ 2026

టీజీ సెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. రెండింటికీ కలిపి మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు.

  • ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌ -2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు (రిజర్వ్‌డ్ వర్గాలకు 50 శాతం) సాధించిన వారు ఈ టీజీ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాలకు ఈ అర్హత తప్పనిసరి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe