ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో నిర్ణయం వెలువడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.
న్యాయబద్ధంగా పనిచేస్తలేరు - జగదీశ్ రెడ్డి

మరోవైపు ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి… స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేస్తలేరని విమర్శించారు. “బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్కి కనపడకపోవడం విచారకరం. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్థమవుతున్నా చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు.
"స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు.కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడతలేదా..? బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారు.స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు స్పీకర్ పిటీషన్ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే.స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదు.. వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయం” అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితం. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అని చెప్పారు.
“ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
{{/usCountry}}“ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
{{/usCountry}}