లండన్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఎస్. శ్రీనాథ్ రెడ్డి లండన్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద వార్తను అతడి కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి, ఉన్నత విద్యను అభ్యసించేందుకు 14 నెలల క్రితం లండన్కు వెళ్లాడని అతని తండ్రి మధుసూదన్ రెడ్డి కన్నీటిపర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుడు ఎలా చనిపోయాడనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, పరిస్థితులు ఇప్పటివరకు తమకు తెలియరాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉన్న కొడుకు అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి, బ్రిటన్ అధికారులతో మాట్లాడి సహాయం చేయాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు.
బర్త్డే పార్టీకి వెళ్లిన తర్వాతే ఘోరం….
జూన్ 22వ తేదీ రాత్రి శ్రీనాథ్ రెడ్డి తమతో ఫోన్లో మాట్లాడాడని, అప్పుడు అతను చాలా సాధారణంగా, సంతోషంగానే ఉన్నాడని తండ్రి మధుసూదన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ రోజే రాత్రి లండన్లో జరిగిన ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు (బర్త్డే పార్టీ) శ్రీనాథ్ హాజరైనట్లు తమకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.
లండన్లోనే నివసిస్తున్న శ్రీనాథ్ రెడ్డి బంధువుల కుమారుడు అందించిన వివరాల ప్రకారం.. జూన్ 23వ తేదీ ఉదయం శ్రీనాథ్ గదిలోనే అతను శవమై కనిపించాడు. శ్రీనాథ్తో కలిసి ఒకే రూమ్లో ఉంటున్న రూమ్మేట్ ఉదయం లేచి చూసేసరికి అతను అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని కనిపించినట్లు సమాచారం.
ఈ మరణం సంభవించిన వెంటనే కాకుండా, కాస్త ఆలస్యంగా రూమ్మేట్ ఇతర స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశాడని శ్రీనాథ్ బంధువులు చెబుతున్నారు. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
{{/usCountry}}ఈ మరణం సంభవించిన వెంటనే కాకుండా, కాస్త ఆలస్యంగా రూమ్మేట్ ఇతర స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశాడని శ్రీనాథ్ బంధువులు చెబుతున్నారు. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
{{/usCountry}}