తెలంగాణలో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పలు జిల్లాల్లో జనాలు ప్రభావితం అవుతున్నారు. రాబోయే ఆరు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తక్షణ సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేసింది.

విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్.. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ.. వైద్య, రెవెన్యూ, పురపాలక, అగ్నిమాపక, కార్మిక శాఖలతో సహా అన్ని విభాగాలను వేడి నివారణ చర్యలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఐదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల సంబంధిత అనారోగ్యాల కారణంగా 10 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి, బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రదేశాలలో కూలింగ్ సెంటర్లు, నీడ కోసం ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐస్ ప్యాక్లను పంపిణీ చేయాలని కూడా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు అవసరమైతే పనివేళలను తగ్గించవచ్చు, తరగతులను నిలిపివేయవచ్చు, అయితే విద్యార్థులకు వాటర్ బ్రేక్స్ తప్పనిసరిగా అందించాలి. ప్రజలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని, మాస్కులు, కళ్లద్దాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వరుసగా రెండు రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత, వడగాలుల ప్రభావిత ప్రాంతాలను రెడ్ అలర్ట్ జోన్లుగా వర్గీకరిస్తారు. దీనికి ప్రభుత్వం మరింత ముమ్మరంగా స్పందించాల్సి ఉంటుంది. గురువారం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో రాష్ట్రంలో అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట సహా తొమ్మిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి.
{{/usCountry}}వరుసగా రెండు రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత, వడగాలుల ప్రభావిత ప్రాంతాలను రెడ్ అలర్ట్ జోన్లుగా వర్గీకరిస్తారు. దీనికి ప్రభుత్వం మరింత ముమ్మరంగా స్పందించాల్సి ఉంటుంది. గురువారం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో రాష్ట్రంలో అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట సహా తొమ్మిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగుతున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు ఆకస్మిక ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లో ఏప్రిల్ 19, 20 తేదీల మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, వడగళ్లు పడే అవకాశం ఉంది.