తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఆ తర్వాత సభలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని మార్షల్స్ అడుకున్నారు.
హౌస్ కమిటీ విచారణకు సిద్ధమా - సీఎం రేవంత్
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో అధికార పక్షం వైపు నుంచి కూడా రియాక్షన్ గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని చెప్పారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
“బాలానగర్ లో వందల కోట్ల భూమి కొల్లగొట్టిన విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హరీష్ రావు సంప్రదించారు. అందులో తన తమ్ముడు, మామ ఇరుక్కున్నారని ఎన్నో సార్లు బ్రతిమిలాడితే దానికి సహకరించలేదని బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు . దీనిపైన పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోమ్ శాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగించాం. 48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా..? కాళేశ్వరం కేసులో కెసీఆర్, హరీష్ ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
{{/usCountry}}“కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోమ్ శాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగించాం. 48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా..? కాళేశ్వరం కేసులో కెసీఆర్, హరీష్ ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
{{/usCountry}}ఎమ్మెల్యే దానం, కడియ శ్రీహరి, మందుల సామేల్, రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వారి పాలనలో చోటు చేసుకున్న భూ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని స్పీకర్ ను కోరారు.