TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు… అలాగే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు రేపటిలోపు (మే 25) ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొనే కొత్త అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కాలేజీలను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు) మే 26 వరకు అవకాశం కల్పించారు.
PH (దివ్యాంగులు), CAP (ఆర్మీ ఉద్యోగుల పిల్లలు), NCC, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వంటి ప్రత్యేక కేటగిరీల కింద సీట్లు ఆశించే అభ్యర్థులకు మే 26న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHLCS) ఈ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ కేటగిరీల విద్యార్థులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
TS DOST 2026 - రిజిస్ట్రేషన్ ప్రాసెస్
1. TS DOST అధికారిక వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
{{/usCountry}}3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
{{/usCountry}}4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించండి.
6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి
సీట్ల కేటాయింపు ఎప్పుడు?
దోస్త్ రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మే 30న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిపోర్ట్ చేయని పక్షంలో వారికి దక్కిన సీటు రద్దవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గడువు లోపల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.