...
...
Next Story

TG ICET Registration 2026 : టీజీ ఐసెట్‌ అప్లికేషన్ గడువు పొడిగింపు - మేలో ఎంట్రెన్స్ ఎగ్జామ్

TG ICET Registration 2026: టీజీ ఐసెట్ - 2026 దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండానే అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్షలు మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు.

Published on: Mar 18, 2026 11:15 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఆలస్య రుసుం లేకుండా మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు పూర్తి అయిన నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండానే అప్లయ్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
టీజీ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

టీజీ ఐసెట్ 2026 - దరఖాస్తు తేదీలు:

టీజీ ఐసెట్ - 2026 కు మార్చి 23 వరకు ఆలస్య రుసుం లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 250 ఫైన్ తో మార్చి 30 వరకు, రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 5 వేల ఫైన్ తో మే 1, రూ. 10 వేల ఫైన్ తో మే 2,3 తేదీల్లో అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 18 - 24వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మేలో ఎంట్రెన్స్ ఎగ్జామ్….

టీజీ ఐసెట్ - 2026 రాత పరీక్షలను మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. సెషన్ 3 పరీక్ష మే 14, 2026 న సింగిల్ షిఫ్ట్ లో జరుగుతుంది.

ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా ఐసెట్ కు మంచి స్పందన వస్తోంది. సీట్లకు కూడా చాలా డిమాండ్ ఉంటోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe