తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ లాసెట్, పీజీఎల్సెట్ ఫలితాలను గురువారం(జూన్ 4) మధ్యాహ్నం 4 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగే ఒక ప్రత్యేక సమావేశంలో టీజీసీహెచ్ఈ (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం కలిసి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఫలితాలను ఆన్లైన్లో ఎలా తనిఖీ చేసుకోవాలి?
ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు క్రింది సాధారణ పద్ధతులను అనుసరించి తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ర్యాంక్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
- మొదటగా అభ్యర్థులు తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్సైట్ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోమ్పేజీలో కనిపించే 'TG LAWCET & PGLCET - 2026 Results' లేదా 'Download Rank Card' లింక్పై క్లిక్ చేయాలి.
- మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' లేదా 'Get Rank Card' బటన్పై క్లిక్ చేయాలి.మీ స్క్రీన్పై ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తులో కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డ్ను ప్రింట్ అవుట్ తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి.
తెలంగాణ వ్యాప్తంగా మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినట్లు అంచనా.
ఫలితాల విడుదలతో పాటు ర్యాంకులను కూడా అధికారులు వెల్లడిస్తారు. ఈ ఫలితాలలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ లేదా జులై నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
{{/usCountry}}ఫలితాల విడుదలతో పాటు ర్యాంకులను కూడా అధికారులు వెల్లడిస్తారు. ఈ ఫలితాలలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ లేదా జులై నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
{{/usCountry}}అభ్యర్థులు తాజా అప్డేట్ల కోసం అధికారిక పోర్టల్ను క్రమం తప్పకుండా పరిశీలించాలి. టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.