...
...
Next Story

TG SET Updates : టీజీ సెట్ 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు ఇవే!

TG SET Certificate Verification : టీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Published on: Apr 11, 2026, 20:28:47 IST
Advertisement

గత నెలలోనే తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

తెలంగాణ సెట్
తెలంగాణ సెట్

ఏప్రిల్ 15వ తేదీతో టీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 19వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టుల వెరిఫికేషన్ పూర్తవుతుందని ప్రకటించారు.

టీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ - షెడ్యూల్:

  • ఏప్రిల్ 15, 2026: జాగ్రఫీ, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, కెమికల్ సైన్సెస్, హిందీ, ఎకనామిక్స్.
  • ఏప్రిల్ 16, 2026: ఎడ్యుకేషన్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎర్త్ సైన్సెస్, సోషియాలజీ.
  • ఏప్రిల్ 17, 2026: పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, సంస్కృతం, మేనేజ్‌మెంట్.
  • ఏప్రిల్ 18, 2026: ఫిజికల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఉర్దూ.
  • ఏప్రిల్ 19, 2026: మ్యాథమెటికల్ సైన్సెస్, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.

మీ వద్ద ఉండాల్సిన ధ్రువపత్రాలు:

  • టీజీ సెట్ - 2025 స్కోర్ కార్డు
  • పదో తరగతి మెమో
  • పీజీ మెమో
  • పీజీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్(కన్వాకేషన్)
  • దివ్యాంగ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • మీ ధ్రువపత్రాలతో కూడిన 2 సెట్ల జిరాక్స్(అటెస్ట్ చేయించి ఉండాలి)
  • ఇతర పత్రాలు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న : టీజీ సెట్ పరీక్ష ఏంటి..? ఎవరు అర్హులు..?

జ: టీజీ సెట్ పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు.

ప్రశ్న : టీజీ సెట్ నోటిఫికేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుంది..?

జ: మే నెలలో సెట్ నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఇటీవలే ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks