TG SET 2026 Applications : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మరియు లెక్చరర్లుగా అర్హత సాధించడానికి నిర్వహించే 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET - 2026) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5, 2026 (నేడు) చివరి తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక సమస్యల బారిన పడకుండా వెంటనే https://telanganaset.org/ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ఆలస్య రుసుముతో దరఖాస్తు షెడ్యూల్ ఇలా….

ఒకవేళ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లయ్ చేసుకోలేకపోతే, అదనపు రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
రూ. 1500 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 8 వరకు, రూ. 2000 ఆలస్య రుసుముతోసెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
దరఖాస్తుల్లో నమోదు చేసిన వివరాలలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ను అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులలో సవరణలు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ 24, 2026 నుండి అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
టీజీ సెట్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (CBT) సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో నిర్వహించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు.
ఈ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
- పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా నైపుణ్యాలు మరియు పరిశోధనా పటిమను (General Awareness, Teaching & Research Aptitude) పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
- పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. ఈ రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
- పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/
ఈ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
- పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా నైపుణ్యాలు మరియు పరిశోధనా పటిమను (General Awareness, Teaching & Research Aptitude) పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
- పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. ఈ రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
- పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/