రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కాగా… ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి(ఆగస్ట్ 3, 2026) నుంచి ప్రారంభం కానుంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉన్నత విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
దరఖాస్తు తేదీలు…

అభ్యర్థులు ఎటువంటి అదనపు ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారికి ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు.
- రూ. 1500 ఆలస్య రుసుముతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చారు.
- రూ. 2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తుకు చివరి అవకాశం కల్పించారు.
- సర్పించి వివరాల్లో ఏవైనా తప్పులుంటే దిద్దుకునేందుకు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
- సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/
ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించే సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల దిద్దుబాటు అందుబాటులో ఉంటుంది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం అభ్యర్థులు https://telanganaset.org/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
{{/usCountry}}పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం అభ్యర్థులు https://telanganaset.org/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
{{/usCountry}}టీజీ సెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. రెండింటికీ కలిపి మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు.