తెలంగాణలో 2026 సంవత్సరానికి మెుదటి విడత ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్టుగా సమాచారం. జనవరిలో టెట్ 2026 నిర్వహించారు. ఈ రెండో విడత పరీక్షకు 1.95 లక్షల మంది హాజరుకాగా.. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి చాలా మంది దరఖాస్తు చేయలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మొదటి టెట్ నోటిఫికేషన్ విషయంపై విద్యాశాఖ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఈ క్రమంలో తొలి టెట్కు ఈ ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చి.. జూన్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే దాదాపుగా ఈనెలలోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది.
ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. గతడాది చివర్లో విడుదలైన నోటిఫికేషన్ కు కూడా చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు.
టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
{{/usCountry}}టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
{{/usCountry}}టెట్ అర్హత మార్కులతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉన్నారు. అధికారిక ఫలితాల ప్రకారం, 1,00,270 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 51.37 శాతం. ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులలో 37,893 మంది అర్హత సాధించారు.
గతంతో పోల్చితే టీజీ టెట్ 2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2 కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. టెట్ పరీక్షకు మెుత్తంగా 1,95,181 మంది హాజరు అవ్వగా.. ఇందులో 65,605 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.
కొత్త నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్ సైట్ ను చూడొచ్చు.