తెలంగాణ టెట్ - 2026(జనవరి) నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలనే షెడ్యూల్ విడుదల కాగా…. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం శుక్రవారం పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులోకి ఉంటుంది. ఇక ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు - ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా… మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. ఇక తెలంగాణ టెట్ - 2026 ఫలితాలను ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…
- అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేయాలి.
- మీ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీకు అప్లికేషన్ నెంబర్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ నెంబర్ ఆధారంగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. దీంతో తాజాగా విద్యాశాఖ ఈ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
{{/usCountry}}ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. దీంతో తాజాగా విద్యాశాఖ ఈ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
{{/usCountry}}టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.
ఇక ఈ టెట్ ఎగ్జామ్ ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. మరోవైపు ఈసారి కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EWS) కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పటివరకు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఉండేవి. ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ జనరల్ కేటగిరీ మాదిరిగానే 60 శాతం ఆపైన వస్తేనే ఉత్తీర్ణులవుతారు.