చర్లపల్లి - తిరువనంతపురం మధ్య ‘అమృత్ భారత్ రైలు’ ప్రారంభం… ఏపీ, తెలంగాణలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే

చర్లపల్లి - తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. కేరళ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది.

Published on: Jan 23, 2026 3:47 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ఈ సరికొత్త ట్రైన్ సేవలను ప్రారంభించారు. మొత్తం 29 స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ ఇచ్చారు. ఇందులో తెలంగాణతో పాటు ఏపీలోని పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది. ఈ రైలు ప్రతి మంగళవారం (ట్రైన్ నెంబర్ 17041) ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి (ట్రైన్ నెంబర్ 17042) గురువారం రాత్రి 11.30కు బయలుదేరి.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

హాల్టింగ్స్ ఇవే…

ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్… తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ, చర్లపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఇక తమిళనాడులోని తిరుత్తణి, కటపాడి,జోలార్ పెట్టయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్.. కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగన్‌సెర్రీ, తిరువల్ల, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల శివగిరి మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.

  • ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా.. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక పద్ధతుల్లో, స్వదేశీ సాంకేతికతతో డిజైన్ చేశారు.
  • అందుబాటు ధరలకే.. వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • సుదూరమైన రూట్లలో.. ప్రయాణించే వారికి నాన్-ఏసీ ప్రయాణాన్ని సౌకర్యవంతమైన వసతులను అందించనున్నారు.
  • ఈ రైలులో ప్రయాణికులకోసం ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ మరియు బాటిల్ హోల్డర్స్ ఉంటాయి.
  • రాత్రివేళల్లో బోగీలో దారి సరిగ్గా కనిపించేలా రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, సౌకర్యవంతమైన సీటింగ్/స్లీపింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రో-న్యుమాటిక్ ఫ్లషింగ్ తో కూడిన మాడ్రన్ టాయిలెట్స్, మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
  • ,దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, స్పీడ్ చార్జింగ్ పాయింట్స్, పాంట్రీ కార్ వంటి వసతులు ఉంటాయి.