Karimnagar PMJ Jewellery Robbery Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూం దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మే 3వ తేదీన పట్టపగలే తుపాకులతో హల్చల్ చేసి…. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లిన అంతరాష్ట్ర ముఠాలోని పలువురిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని…. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంతమేర బంగారు ఆభరణాలు, పిస్టల్స్, పరారీకి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు.

షోరూంలో దోపిడీ అనంతరం దొంగలు తమ బైకులపై మహారాష్ట్ర మీదుగా పశ్చిమ బెంగాల్కు పారిపోయినట్లు విచారణలో తేలింది. సుమారు 1.6 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజీని ఆధారంగా చేసుకుని వేట ప్రారంభించారు. నిందితులు ధర్మపురి వద్ద బైకును వదిలివేసి…. అంతర్గత రహదారుల గుండా తప్పించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసు బృందాలు నిందితులను బెంగాల్, బీహార్లలో గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం వెల్లడించారు. ఈ దోపిడీ కేసులో మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. దోపిడీకి ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని వివరించారు. ధర్మపురిలో ఆశ్రయం పొందారని… చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి పరారయ్యారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. రెండు నెలల క్రితమే నాలుగు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. చివరికి కరీంనగర్లో దోపిడీ చేశారని తెలిపారు.
మాస్టర్ మైండ్ సుబోద్ సింగ్…!
ఈ భారీ దోపిడీ వెనుక బీహార్కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 'గోల్డెన్ థీఫ్'గా పేరుగాంచిన సుబోద్ సింగ్ మాస్టర్ మైండ్గా ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ దోపిడీకి సంబంధించి ఆన్లైన్ ద్వారా నిందితులను ఎంపిక చేసి… వారికి శిక్షణ ఇచ్చి ఈ స్కెచ్ అమలు చేశారు.
ఈ దోపిడీలో ప్రత్యక్షంగా ఐదుగురు పాల్గొనగా…. పరోక్షంగా మొత్తం 13 మంది సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్తో పాటు మిగిలిన 10 మంది నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన వారి నుంచి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ దోపిడీలో ప్రత్యక్షంగా ఐదుగురు పాల్గొనగా…. పరోక్షంగా మొత్తం 13 మంది సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్తో పాటు మిగిలిన 10 మంది నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన వారి నుంచి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}