Traffic Diversions : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం - హైదరాబాద్లో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లు తెలుసుకోండి
Hyderabad Traffic Advisory : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు. జూలై 21, 22 తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ స్థలాల వివరాలు ఇవే.
Hyderabad Traffic Advisory : హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి తిరు కల్యాణోత్సవం, రథోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చూసేందుకు, నగరంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రతను కాపాడటం మరియు ట్రాఫిక్ జామ్లను నివారించడమే లక్ష్యంగా జూలై 21(ఇవాళ), జూలై 22(రేపు) తేదీలలో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
వాహనాల మళ్లింపు వివరాలు :
ఉత్సవాలు జరిగే రోజుల్లో బల్కంపేట పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించే వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.
- గ్రీన్ ల్యాండ్స్, సత్యం థియేటర్ మీదుగా ఎస్.ఆర్.నగర్ వైపు వెళ్లే వాహనాలను బి.కె.గూడ మీదుగా సనత్ నగర్, ఫతే నగర్ వైపు మళ్లిస్తారు.
- ఫతే నగర్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్, ఆర్.యు.బి (రైల్వే అండర్ బ్రిడ్జ్) మీదుగా బేగంపేట వైపు పంపిస్తారు.
- ఫుడ్ వరల్డ్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను సోనాబాయి టెంపుల్, మైత్రివనం మీదుగా ఎస్.ఆర్.నగర్ వైపు మళ్లిస్తారు.
- బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనదారులు బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్, మైత్రివనం మార్గాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
- ఎస్.ఆర్.నగర్ టి జంక్షన్ ప్రాంతంలో ఉన్న ఫతే నగర్ ఉప రహదారులు (బై-లేన్స్) అన్నింటినీ పూర్తిగా మూసివేస్తారు.
భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు :
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను నిలపడానికి పోలీసులు క్రింది ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు:
- ఆర్ అండ్ బి ఆఫీస్ ఆవరణ
- జీహెచ్ఎంసీ మైదానం
- పద్మశ్రీ అపార్ట్మెంట్స్ పరిసరాలు (డి.కె. రోడ్)
- ఫతే నగర్ అండర్ బ్రిడ్జ్ క్రింది భాగం
- నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణ
- సనత్ నగర్లోని జిహెచ్ఎంసి ప్లేగ్రౌండ్
పండుగ వేళ బల్కంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, సాధారణ ప్రయాణికులు మరియు వాహనదారులు బాల్కంపేట మార్గంలో ప్రయాణించకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

