...
...
Next Story

టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్‌తో రిజల్ట్ చూసుకోండి

TG Polycet Results 2026 : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి కూడా అమ్మాయిలదే హవా కొనసాగింది. ఇక్కడ డైరెక్ట్ లింక్స్ ద్వారా ఫలితాలు చూసుకోండి.

Published on: May 23, 2026, 13:06:04 IST
Advertisement

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. మెుత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. కళాశాల మరియు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ బోర్డు కార్యదర్శి ఎ. పుల్లయ్యతో కలిసి https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల 2026
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల 2026

పాలిసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరు కాగా, 81,307 మంది (82.94 శాతం) అర్హత సాధించారు. MBiPC స్ట్రీమ్‌లో 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా, 79,652 మంది (81.25 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేసుకోవాలి?

అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ఓపెన్ చేయండి.

హోమ్‌పేజీలో కనిపించే TS POLYCET 2026 Rank Card లింక్‌పై క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.

వివరాలు సరిచూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ర్యాంక్ కార్డ్ అవసరం కాబట్టి, దీనిని ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా టీజీ పాలిసెట్ 2026 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి.

టీజీ పాలిసెట్ 2026 - తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

  • టీజీ పాలిసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి జూన్ మొదటి వారం వరకు సాగనుంది.
  • మే 27 నుంచి 31 వరకు : అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
  • మే 29 నుంచి జూన్ 1 వరకు : హెల్ప్‌లైన్ కేంద్రాలలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) జరుగుతుంది.
  • మే 29 నుంచి జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • జూన్ 6న : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతారు.
  • జూన్ 6 నుంచి 9 వరకు : సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • జూన్ 8 మరియు 9 తేదీల్లో : విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలల్లో నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
  • జూన్ 9న : పాలిటెక్నిక్ కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe