ఉప్పల్ నుంచి నారపల్లి వైపు రావాలంటే ఆ ప్రయాణం ఎంత నరకమో చాలా మందికి తెలుసు. వరంగల్ వైపు వెళ్లేవారు ఈ దారి ఎప్పుడు అయిపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంతలా రోడ్డు అధ్వాన్నంగా ఉంటుంది. ఈ దారిలో వెళ్తుంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయనేది నిజం. దీనిపై సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోల్స్ ఉన్నాయి. దారంతా గుంతలు, పైకి ఎగిరే దుమ్ముతో ఈ రూట్లో ప్రయాణించేందుకు భయపడుతుంటారు జనాలు.

అయితే తాజాగా ఈ రూట్లలో ఫ్లైఓవర్ వర్క్స్ కూడా కాస్త త్వరగా చేస్తున్నారు. ఉప్పల్ నుంచి కూడా కొంత దూరం రోడ్డు వేశారు. ఇప్పుడు ఈ రూట్ మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మెుదలుపెట్టామని కోమటిరెడ్డి చెప్పారు. 5.5 కి.మీ గానూ 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైందన్నారు. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
'ఉప్పల్ వరంగల్ మార్గంలో మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. రోడ్డు పనులు, ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరత్వరగా నడుస్తున్నాయి. 2026నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేస్తాం. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిర్మాణం ఆపే ప్రసక్తి లేదు.' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
మేడారం జాతర ప్రారంభమయ్యే సమయానికి బీటీ రోడ్డు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2026 దసరా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తామన్నారు.
ఉప్పల్-వరంగల్ హైవేపై ఉప్పల్-మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి భారత్మాల పథకం కింద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2018 మేలో ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ పనులు నత్తనడక సాగి.. ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ పనులతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఉప్పల్ నుంచి దాదాపు నారపల్లి వరకూ రోడ్డుపై ప్రయాణం నరకంలా ఉంటుంది. అయితే తాజాగా అధికారులు రోడ్లకు రిపేర్లతోపాటుగా ఫ్లైఓవర్ పనులు చేస్తున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని జనాలు కోరుకుంటున్నారు.
{{/usCountry}}ఉప్పల్-వరంగల్ హైవేపై ఉప్పల్-మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి భారత్మాల పథకం కింద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2018 మేలో ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ పనులు నత్తనడక సాగి.. ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ పనులతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఉప్పల్ నుంచి దాదాపు నారపల్లి వరకూ రోడ్డుపై ప్రయాణం నరకంలా ఉంటుంది. అయితే తాజాగా అధికారులు రోడ్లకు రిపేర్లతోపాటుగా ఫ్లైఓవర్ పనులు చేస్తున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని జనాలు కోరుకుంటున్నారు.
{{/usCountry}}