వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.6,60,000 విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ, ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు:
- సిరిగిరి ప్రసాద్ (26) – తారకరామా కాలనీ, ఓదెల గ్రామం, పెద్దపల్లి జిల్లా
- మోతే రాజు (25) – భగత్ సింగ్ నగర్, చున్నంబట్టి కాలనీ, మంచిర్యాల
- టేకు నవీన్ – ప్రగతి నగర్, ఎన్టిపిసి, గోదావరిఖని
- మోటం తిరుపతి – గాంధీ నగర్, మంచిర్యాల టౌన్
- వారణాసి లక్ష్మణ్ (26) – ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల
- మోటం నరేష్ (25) – గాంధీనగర్, మంచిర్యాల
- వస్తం భీమేష్ (28) – భగత్ సింగ్ నగర్, మంచిర్యాల

నిందితులు మద్యానికి అలవాటు పడి జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించి అమ్ముకుంటూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు గతంలో కూడా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించిన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర పోలీస్ స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం, సైదాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాల్లో 36 మోటార్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ దొంగిలించినట్లు తేలింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత , ఏసీపిలు పీ.సదయ్య, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.
వంగపెళ్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు ఆటో ట్రాలీ, కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరకాల ప్రాంతంలోని ఒక ఇంటిలో దాచిపెట్టిన మరికొన్ని మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎ.రాఘవేందర్, కె.రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటి కోర్ టీమ్ ఏఏఓ మొహమ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ హమ్మెద్, కె. మహేశ్వర్, వి.జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్.ఐ దిలీప్, సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.
{{/usCountry}}ఈ కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎ.రాఘవేందర్, కె.రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటి కోర్ టీమ్ ఏఏఓ మొహమ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ హమ్మెద్, కె. మహేశ్వర్, వి.జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్.ఐ దిలీప్, సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.
{{/usCountry}}