హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పరిధిలో దారుణం వెలుగూ చూసింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. తీవ్రంగా దాడి చేయటమే కాకుండా…. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటల దాటికి భార్య మృతి చెందగా… ఈ ఘటనలో కుమార్తె కూడా గాయపడింది.

ప్రాథమిక వివరాల ప్రకారం…. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా… ప్రస్తుతం నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ… ఆ తర్వాత భార్యపై వెంకటేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఏదో ఓ రకంగా వేధిస్తూ గొడవపడేవాడు. ఇటీవలే భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత త్రివేణిని భర్త వెంకటేశ్ తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు.
ఎప్పటిలాగే మరోసారి భార్యతో గొడవపడిన వెంకటేశ్… త్రివేణిపై దాడి చేశాడు. విచక్షణ మరిచి… పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న కుమార్తెను కూడా మంటల్లో తోసేసి… అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి… మంటలను అర్పేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే త్రివేణి ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది.
కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు… నిందితుడు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు తరలించారు. త్రివేణిని అత్యంత దారుణంగా చంపేయటంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.