కొంతమంది వాహనాదారులు… వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తప్పతాగి వాహనాలను నడపటం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తూ… ఇతరుల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నారు. పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నప్పటికీ…. ఏదో ఒక చోట విషాద ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం…ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
కిలో మీటర్ వరకు లాకెళ్లాడు…!

ప్రాథమిక వివరాల ప్రకారం…. మాదాపూర్ మీదుగా అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనైే మైండ్ స్పేస్ వద్ద వీరి స్కూటీని… డీసీఎం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. స్కూటీ డీసీఎం కిందికి వెళ్లిపోయింది. ప్రమాద తీరును గమనించిన డీసీఎం డ్రైవర్… కనీసం కిందికి కూడా దిగలేదు. డీసీఎంను ఆపకుండా కిలో మీటర్ మేర అలానే లాక్కుని వెళ్లి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల తర్వాత జరిగింది.
స్కూటీ ఇరుకుపోయిన విషయాన్ని రోడ్డుపై ఉన్న వాళ్లు గమనించి… డ్రైవర్ ను ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే డ్రైవర్ డీసీఎం దిగి పారిపోగా… క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య ఆయేషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త బాసిత్ కు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర విభాగంలో ఉంచి… చికిత్స అందిస్తున్నారు.
వీరు కేరళకు చెందిన దంపతులుగా గుర్తించారు. కూకట్పల్లిలోని ఓ మాల్లో సినిమా చూసి… మహేశ్వరంలోని తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాద తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లను కఠినంగా శిక్షిస్తేనే…. ఇతరుల్లో కూడా మార్పు వస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
{{/usCountry}}ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాద తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లను కఠినంగా శిక్షిస్తేనే…. ఇతరుల్లో కూడా మార్పు వస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
{{/usCountry}}పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని… పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేయగా… తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.