హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ పబ్పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఈ రైడ్ లో మహిళా డీసీపీ రితిరాజ్ కీలకంగా వ్యవహరించారు.
కూకట్పల్లి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రితి రాజ్….. ఆదివారం తెల్లవారుజామున స్వయంగా రంగంలోకి దిగారు. 'క్లబ్ మస్తీ'గా ప్రాచుర్యం పొందిన 'కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్' లో అసాంఘిక పనులు సాగుతున్నాయనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీసీపీ రితి రాజ్ ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పౌరురాలిలా అండర్ కవర్ వెరిఫికేషన్ నిర్వహించారు. అక్కడ జరుగుతున్న ‘గలీజ్ దందా’ మొత్తాన్ని తన మొబైల్లో సీక్రెట్గా షూట్ చేసి…. పక్కా ఆధారాలను సేకరించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పబ్పై ఆకస్మికంగా దాడి చేశారు.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం…. సదరు పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. మద్యం సరఫరా చేసే ఇటువంటి ప్రాంగణాల్లోకి మైనర్లు రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. అంతేకాకుండా…. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆహారం, మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. కనీసం పోలీస్ శాఖ నుంచి పొందాల్సిన చెల్లామణిలో ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా ఈ పబ్కు లేకపోవడం గమనార్హం.
"మహిళలను ఎరగా చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించడం… వారి ద్వారా భారీగా బిల్లులు చేయించి అక్రమంగా లాభాలు గడించడం వంటి ప్రాథమిక ఆధారాలు లభించాయి," అని పోలీసులు స్పష్టం చేశారు. కస్టమర్ల కోసం యాజమాన్యమే స్వయంగా మహిళలను రంగంలోకి దింపుతూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
తొమ్మిది మంది సిబ్బంది అరెస్ట్
ఈ మెరుపు దాడిలో భాగంగా నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యల నిమిత్తం వారిని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పబ్పై గతంలో 2025లో కూడా పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ యాజమాన్యం తీరు మార్చుకోకుండా నిరంతరం ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంది.
ఈ ఆపరేషన్ను కూకట్పల్లి డీసీపీ రితి రాజ్ ముందుండి నడిపించారు. పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని (2010 బ్యాచ్) అయిన ఆమె….. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీ (NLU) నుంచి 2016లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2018లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరారు. సైబరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్స్, మాదాపూర్ జోన్ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన తర్వాత ఆమె కూకట్పల్లి డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బండి భగీరథ్ సాయిపై నమోదైన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందానికి (SIT) కూడా రితి రాజ్ నాయకత్వం వహిస్తున్నారు.
{{/usCountry}}ఈ ఆపరేషన్ను కూకట్పల్లి డీసీపీ రితి రాజ్ ముందుండి నడిపించారు. పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని (2010 బ్యాచ్) అయిన ఆమె….. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీ (NLU) నుంచి 2016లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2018లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరారు. సైబరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్స్, మాదాపూర్ జోన్ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన తర్వాత ఆమె కూకట్పల్లి డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బండి భగీరథ్ సాయిపై నమోదైన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందానికి (SIT) కూడా రితి రాజ్ నాయకత్వం వహిస్తున్నారు.
{{/usCountry}}