సంక్రాంతి పండగ సందడి.. సముద్రంలో మత్స్యకారులకు పడవ పోటీలు!
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో సముద్రంలో పడవ పోటీలు నిర్వహించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మాడనూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్ రేస్, ఈత, రంగోలీల పోటీలు నిర్వహించారు. బోట్ రేస్ పోటీలో 14 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో బోటులో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ఉన్నారు. మడనూరు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఇక్కడికి వచ్చారు.

పట్టపుపాలెం, పెద పట్టపుపాలెం, ఈతముక్కల పల్లె పాలెం, వాజిరెడ్డి పాలెం, మదనూరు పాలెంపాలెం, మాడనూరు తదితర మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పడవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సముద్రంలో పడవ పోటీలు కన్నుల పండువగా నిర్వహించారు. 14 పడవల్లో మత్స్యకారులు ఉత్సహంగా పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో భాగంగా సముద్రంలో 500 మీటర్ల దూరంలో ఉన్న జెండాను తీసుకు వచ్చి తీరం వద్దకు రావాలి. ఇందుకోసం మూడు బహుమతులు పెట్టారు. బ్రహ్మయ్య, శ్రీనుల బృందం మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000 నాగబాబు, రాములు గెలుచుకున్నారు. హరిబాబు, కొండలరావులకు రూ.5,000 తృతీయ బహుమతి లభించింది.
ఇక సంక్రంతి సందర్భంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల హైలెట్ అని చెప్పవచ్చు. 500 మీటర్ల పరుగు పందెంలో జంగారెడ్డిగూడెం జట్టుకు చెందిన ఎర్రా కాల్వ మొదటి స్థానాన్ని గెలుచుకోగా, ఏలూరు జట్టుకు చెందిన బండారు బలగం 1,000 మీటర్ల పరుగు పందెంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పోటీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి.
500 మీటర్ల ఈవెంట్లో కర్నూలు జట్టు రెండో స్థానంలో, పల్నాడు జట్టు మూడో స్థానంలో నిలిచింది. 1,000 మీటర్ల రేసులో పల్నాడు రెండో స్థానంలో, కోనసీమ మూడో స్థానంలో నిలిచింది. 500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.70,000, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.30,000 బహుమతిగా ఇచ్చారు. 1,000 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.2 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.1 లక్ష, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000 బహుమతిగా ఇచ్చారు.

E-Paper












