ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు ఉన్న బోటు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Published on: Nov 30, 2025 9:56 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును గమనించారు. సముద్రంలో వేట లేకున్నా ఈ సమయంలో వెళ్లడం ఏంటని అనుకున్నారు. ఇసుక దిబ్బలపై ఉన్న స్థానిక మత్స్యకారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

బంగ్లాదేశ్ మత్స్యకారులు
బంగ్లాదేశ్ మత్స్యకారులు

కొట్టుకొచ్చిన బోటులో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే వారు మాట్లాడేది మెుదట్లో అర్థంకాక కాసేపు సమస్యలు తలెత్తింది. ఎట్టకేలకు వారు బంగ్లాదేశ్ మత్స్యకారులుగా మెరైన్ పోలీసులు గుర్తించారు. సముద్రంలో వెటకు వచ్చి.. వీరి బోటు తప్పిపోయింది. దీంతో చాలా రోజులుగా సముద్రంలోనే గడుపుతూ వస్తున్నారు. అయితే ఇంధనం, భోజన సామగ్రి అయిపోయింది. దాదాపు 15 రోజులకు సరిపడా తెచ్చుకున్న ఆహార సామగ్రి అయిపోయేసరికి చేసేదేమీ లేక అలానే ఉండిపోయారు.

సముద్రంలోనే కొన్ని రోజులు తిండి లేక ఉన్నారు. వారి బోటు పశ్చిమ బెంగాల్, ఓడిశా మీదుగా శ్రీకాకుళం జిల్లా తీరానికి చేరింది. బిక్కు బిక్కుమంటూ అలానే గడిపారు. అయితే ఓవైపు దిత్వా తుపాను ప్రభావంతో సముద్రంలో వేటపై అధికారులు ఆంక్షలు విధించారు. కానీ స్థానికులకు మాత్రం ఏదో బోటు సముద్రంలో వెళ్తున్నట్టుగా కనిపించింది. అనుమానాస్పదంగా అనిపించేసరికి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బోటు మన ప్రాంతానికి చెందినది కాదని స్థానికులు తెలిపారు. అందులో ఉన్నవారిని కూడా అనుమానించారు. మెరైన్ పోలీసులు వచ్చి.. మరో మూడు బోట్ల సాయంతో సిబ్బందిని పంపించారు. బంగ్లాదేశ్ మత్స్యకారులను ఒడ్డుకు తెచ్చారు. వారిని చూసి మాట్లాడిన తర్వాత బంగ్లాదేశ్ వ్యక్తులుగా గుర్తించారు.

ప్రస్తుతానికి తిండి లేక వారు చాలా నిరసంగా ఉన్నారు. సరిగా మాట్లాడలేని పరిస్థితిలో భయంతో గడుపుతున్నారు. కొందరు స్థానికులు బంగ్లాదేశ్ తెలియడంతో వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే చాలా రోజులుగా తమకు భోజనం లేదని, ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాలేదని బంగ్లాదేశ్ మత్స్యకారులు వెల్లడించారు. తీవ్రంగా భయపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. పోలీసులు కళింగపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనుమతి లేకుండా సరిహద్దు దాటి వచ్చినందుకు వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు.

News/Andhra Pradesh/ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!
News/Andhra Pradesh/ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!