...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్.. జూలై 31, ఆగస్టు 1న భోగాపురానికి 2000 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. మెుత్తం 2000 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు భోగాపురం వైపు నడవనున్నాయి. దీంతో జిల్లాల్లో ప్రయాణికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

Published on: Jul 28, 2026, 15:40:43 IST
Advertisement

విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి, బహిరంగ సభకు వచ్చే ప్రజల రవాణా సౌకర్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,000 బస్సులను భోగాపురం తరలించనున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 160 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా భోగాపురం కేటాయించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వి. నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికారంగా జూలై 31, 2026 నుండి ఆగస్టు 1, 2026 వరకు (రెండు రోజుల పాటు) ఎన్టీఆర్ జిల్లా పరిధిలో సాధారణ ప్రయాణికులకు కొన్ని బస్సులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు. అవసరమైన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో జీఎమ్‌ఆర్ గ్రూప్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ నమూనాలో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది.

మొదటి విడతలో ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీనిని 4 కోట్లకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. పెద్ద రకం విమానాలు సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవైన రన్ వేను ఏర్పాటు చేశారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర పరిధిలో పరిశ్రమలు, టూరిజం, ఐటీ మరియు కార్గో రవాణా రంగాలకు భారీ ఊతం లభించనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe