డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లి తిరిగి రాని బోటు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అల్లవరం మండలం పరిధిలోని ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుండి సముద్రంలోకి వెళ్లిన బోటు, దానిలోని మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన IND-AP-E8-MO-135 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు ద్వారా 8 మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. నిబంధనల ప్రకారం వేట పూర్తి చేసుకుని తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. నిర్దేశిత సమయం దాటినా బోటు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అధికారులను ఆశ్రయించారు.
గల్లంతైన బోటును IND-AP-E8-MO-135 నమోదు సంఖ్యతో అధికారులు గుర్తించారు. ఈ బోటులో మొత్తం 8 మంది వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుండి వేటకు బయలుదేరారు. ప్రణాళిక ప్రకారం ఈ నెల 13న వీరు ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
బోటులో సుమారు 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు (రేషన్), 1,000 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. బోటు ఆచూకీ కోసం అధికారులు చేపట్టిన సంప్రదింపుల ప్రయత్నాలు ఫలించలేదు. మత్స్యకారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెంటనే చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు ఉండవచ్చని భావిస్తున్నారు.
సముద్రంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడేందుకు కలెక్టర్ కలెక్టరేట్ నుండి సమన్వయ చర్యలు ప్రారంభించారు. గాలింపు, పునరుద్ధరణ, చర్యలు వేగవంతం చేయడానికి ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో చర్చించి, ఆచూకీ కనుగొనడానికి పోలీసు వ్యవస్థను కూడా భాగస్వామ్యం చేశారు.
{{/usCountry}}సముద్రంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడేందుకు కలెక్టర్ కలెక్టరేట్ నుండి సమన్వయ చర్యలు ప్రారంభించారు. గాలింపు, పునరుద్ధరణ, చర్యలు వేగవంతం చేయడానికి ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో చర్చించి, ఆచూకీ కనుగొనడానికి పోలీసు వ్యవస్థను కూడా భాగస్వామ్యం చేశారు.
{{/usCountry}}బోటు యజమాని, బాధిత మత్స్యకారుల కుటుంబాల నుండి సాంకేతిక వివరాలను సేకరించి, రెస్క్యూ టీమ్లకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కోస్ట్గార్డ్ బోట్లు.. సముద్రంలో తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.