వాతావరణశాఖ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది.
ఏపీకి భారీ వర్ష సూచన…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది.రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇక అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం… ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక రాయలసీమ ప్రాంతంలోనూ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
పెరుగుతున్న చలి తీవ్రత…
ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా… తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీలు నమోదైంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… తెలంగాణలో ఈ వారంరోజుల పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… తెలంగాణలో ఈ వారంరోజుల పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}ఇక ఈనెల 21వ తేదీన అల్పపీడనం ఏర్పడితే… తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీనిపై ఐఎండీ నుంచి మరిత క్లారిటీ రావాల్సి ఉంది.