మృత్యువు ఒడిలోనూ మమకారం.. మంటల్లో కాలిపోతూ కొడుకును కాపాడుకున్న తల్లి!

Markapuram Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదంలో తన ప్రాణాలను పణంగా పెట్టి.. మంటల నుంచి కొడుకును బయటకు నెట్టి కాపాడుకుంది ఒక తల్లి. చివరకు తను మంటల్లో కాలిపోతూ ప్రాణాలు వదిలింది.

Published on: Mar 26, 2026, 17:22:22 IST
By , Markapuram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగుతున్న వేళ.. తన ప్రాణం పోతుందని తెలిసినా.. కన్నప్రేమతో ఓ తల్లి తన కొడుకును కిటికీలోంచి బయటకు నెట్టింది, సురక్షితంగా కాపాడుకుంది. తాను మాత్రం మంటల్లో చిక్కుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

కొడుకును కాపాడుతూ చనిపోయిన తల్లి
కొడుకును కాపాడుతూ చనిపోయిన తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి సమీపంలో రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఒక టిప్పర్ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది మరణించారు. ఈ ఢీకొన్న ప్రభావంతో చెలరేగిన భారీ మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కనిగిరికి చెందిన 45 ఏళ్ల ఉప్పు రమాదేవి కూడా ఉన్నారు. ఆమె తన కుమారుడు మనోహర్‌తో కలిసి జగిత్యాల నుండి వారి స్వగ్రామానికి ప్రయాణిస్తున్నారు. మంటలు తీవ్రమై, బస్సులో వ్యాపించే సమయంలో తన కుమారుడికి తీవ్రమైన ప్రమాదం ఉందని రమాదేవి గ్రహించారు. తన కొడుకును కాపాడాలనే తీవ్ర ప్రయత్నంలో ఆమె తన కుమారుడిని బస్సు కిటికీలోంచి బయటకు తోసేశారు. ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో రమాదేవి బయటపడలేక లోపలే చిక్కుకుపోయారు. మంటల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు చీకటి, పొగ, మంటలు, వేడి, గందరగోళం, నిద్రలో సీట్ల నుంచి కిందపడిపోవడం వంటి అనుభవాలను చూశారు. ఈ ఘోర ప్రమాదం అనంతరం భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. పూర్తిగా కాలిపోయిన అనేక మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్నాయి.

ప్రమాదాన్ని వివరిస్తూ.. ఆసుపత్రి మంచంపై పడుకుని ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ఏడుస్తూ చాలా విషయాలు చెప్పింది. తమతో ఉన్న ఉన్న బాలుడు, పిన్ని మనం చనిపోతాం అని వ్యాఖ్యానించినట్లు మహిళ చెప్పింది. 'మేం ఉదయానికల్లా ఉదయగిరికి చేరుకోవాల్సి ఉంది. ముగ్గురం ఉన్నాం. మాలో ఇద్దరు బతికే ఉన్నారు, కానీ అబ్బాయి ఆచూకీ లేదు. మేం నిద్రపోతుండగా సీట్లలోంచి కింద పడిపోయాం. ఎందుకు పడిపోయామో గ్రహించేసరికి పొగ కమ్మేసింది.' అని మహిళ చెప్పుకొచ్చారు.

ఏం జరిగిందో, పొగ ఎందుకు వస్తోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ బాలుడు ఆ మాట అన్నాడని మహిళ తెలిపింది. ఇద్దరం కిటికీలో నుంచి తప్పించుకోగలిగామని చెప్పింది.

ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన మరో మహిళా ప్రయాణికురాలు ఆసుపత్రిలో వెక్కి వెక్కి ఏడ్చింది. 'నేను పై బెర్త్‌లో నిద్రపోతున్నాను, కిందకి పడిపోయాను. ఆ మంటల్లో నాకు ఏం అర్థం కాలేదు. ఎవరో నన్ను బయటకు లాగారు. ఎవరో నాకు తెలియదు.' అని చెప్పుకొచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More