హైదరాబాద్లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం.. ఇందులో 5 సెకన్లలో హార్ట్ స్కానింగ్
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశంలో ప్రముఖ హెల్త్కేర్ హబ్గా అభివృద్ధి చెందుతోందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో భారత్లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు, మెడికవర్ ఆసుపత్రుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ నూతన ఆసుపత్రి దేశంలోనే అత్యంత ఎత్తైన ఆసుపత్రి భవనాలలో ఒకటిగా నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందించిన ఈ ఆసుపత్రిలో 550 పడకల సామర్థ్యం ఉంది. పలు ప్రత్యేక వైద్య విభాగాలలో సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఇది సిద్ధంగా ఉంది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ ఆసుపత్రి ప్రారంభంతో మెడికవర్ ఆసుపత్రులు దేశవ్యాప్తంగా తమ సేవలను మరింత విస్తరించాయి. ఈ ఆసుపత్రిలో ముఖ్యంగా 5 సెకన్లలో గుండె స్కాన్ పూర్తి చేసే అత్యాధునిక హార్ట్ స్కానింగ్ టెక్నాలజీని మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా 640-స్లైస్ సీటీ స్కాన్ సాంకేతికతను ఏర్పాటు చేసి మరింత స్పష్టమైన చిత్రీకరణతో వేగవంతమైన, కచ్చితమైన నిర్ధారణకు అవకాశం కల్పించారు.
ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 'హైదరాబాద్ దేశంలో ప్రముఖ హెల్త్కేర్ హబ్గా అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల స్థాపన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.' అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఎంతో సహాయపడతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని మెడికవర్ ఆసుపత్రుల ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జి. అనిల్ కృష్ణ చెప్పారు. 640-స్లైస్ సీటీ స్కాన్, వేగవంతమైన హార్ట్ స్కానింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో కచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందించగలమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎ. శరత్ రెడ్డి అన్నారు.
'హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి వైద్య సేవల అవసరం పెరుగుతోంది. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం.' అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ అన్నారు.
డైరెక్టర్ డా.ఎ.ఆర్.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు, సమగ్ర వైద్య విధానాలతో ఈ ఆసుపత్రి రోగులకు వేగవంతమైన, సమర్థవంతమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


