...
...
Next Story

AIAPGET 2026 : ఆయుష్ పీజీ ప్రవేశాలు.. జులై 31 లాస్ట్ డేట్.. ఆగస్టు 22న పరీక్ష

AIAPGET 2026 : ఆయుష్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. జులై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 22న పరీక్ష ఉంటుంది.

Updated on: Jul 19, 2026 07:49 PM IST
Advertisement

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యా సంవత్సరం 2026-27 ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్'(AIAPGET 2026) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆమోదంతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఎన్టీఏ ఈ పరీక్షను 2019 నుండి విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఆయుష్ పీజీ ప్రవేశాలు
ఆయుష్ పీజీ ప్రవేశాలు

భారతదేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి కళాశాలలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలలో లభించే ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా ఎండీ/ఎమ్ఎస్ సీట్ల భర్తీకి ఈ పరీక్ష ఉమ్మడి ప్రవేశ పరీక్షగా ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 120 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు 122 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

అభ్యర్థులు 31 జూలై 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణ 01 నుండి 02 ఆగస్టు 2026 వరకు చేయవచ్చు. అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ వివరాలు తర్వాత వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు పరీక్ష నిర్వహణ తేదీ 22 ఆగస్టు 2026. అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించినంత మాత్రాన లేదా పరీక్షకు హాజరైనంత మాత్రాన అడ్మిషన్ పొందే హక్కు లభించదు. విద్యా అర్హతలు, ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం, రిజిస్ట్రేషన్ అవసరాలు, రిజర్వేషన్ ప్రమాణాలు వంటి అర్హతలను కౌన్సిలింగ్ సమయంలో సంబంధిత అధికారులు ధృవీకరిస్తారు.

PwD/PwBD కేటగిరీ కింద రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు తమ యూనిక్ డిసబిలిటీ ఐడీ కార్డ్‌ను అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలను అధికారిక పోర్టల్ ద్వారా ధృవీకరిస్తారు. ఒకవేళ UDID కార్డ్ లేకపోతే సంబంధిత అధికారి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే డిసబిలిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe