Amaravati phase II Land Pooling : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి రెండో విడత భూసేకరణ చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే భూములిచ్చిన రైతులకు అండగా ఉండేందుకు ఏపీ సర్కార్…. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎకరానికి రూ. 40 వేల కౌలు…

గ్రీన్ ఫీల్డ్ రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ (Land Pooling Scheme - LPS) కింద భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రయోజనాలను ప్రకటించారు. ఈ రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 40 వేల చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇది వరకు ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ప్రకటించగా…. దాన్ని ఇప్పుడు రూ.40 వేలకు పెంచారు.
కేవలం కౌలు మొత్తాన్ని ప్రకటించడమే కాకుండా, రైతులకు మరిన్ని ఆర్థిక వెసులుబాటులను కల్పించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఏటా ఈ కౌలు మొత్తంపై రూ. 3,000 చొప్పున పెంపుదలఉంటుందని హామీ ఇచ్చారు. దీనితో పాటు…. భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు పంట రుణాన్ని మంజూరు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు.
శనివారం విడుదలైన అధికారిక ప్రకటనలోని వివరాల ప్రకారం…. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని 10 గ్రామాల రైతులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాజధాని కోసం ఇప్పటివరకు సేకరించిన భూముల వివరాలను పరిశీలిస్తే…. మొదటి విడతలో 31,150 మంది రైతులు సుమారు 34,983 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో విడత కింద మరో 40,000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
{{/usCountry}}రాజధాని కోసం ఇప్పటివరకు సేకరించిన భూముల వివరాలను పరిశీలిస్తే…. మొదటి విడతలో 31,150 మంది రైతులు సుమారు 34,983 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో విడత కింద మరో 40,000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
{{/usCountry}}అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అదనపు భూమి అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ప్రకటించారు. అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) నిర్మాణం, రైల్వే స్టేషన్ ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం మరియు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల కోసమే ఈ అదనపు భూ సమీకరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. భూసేకరణతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగవంతం కానుందని వివరిస్తున్నారు.