...
...
Next Story

విశాఖ ఎకనామిక్ రీజియన్‌తో 9.3 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ద్వారా విభిన్న రంగాల్లో ₹9.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో రూ. 4 లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చించనుండగా, రూ. 5.3 లక్షల కోట్లను ప్రైవేట్ భాగస్వామ్యంతో సమీకరించనుంది.

Published on: Aug 6, 2026, 08:27:34 IST
Advertisement

ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రరూప్‌రేఖలను సిద్ధం చేసింది. 'విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్' (VER) ప్రాజెక్టు ద్వారా దాదాపు 9.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఇఆర్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌తో  ₹9.3 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ (@AndhraPradeshCM X)
విశాఖ ఎకనామిక్ రీజియన్‌తో ₹9.3 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ (@AndhraPradeshCM X)

ఈ బృహత్తర ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు వెచ్చించనుండగా, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రూ. 5.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

"మైక్రో లెవెల్ ప్లానింగ్ ద్వారా విశాఖ రీజియన్ మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే విఇఆర్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

'బే సిటీ' ప్రాజెక్ట్ కీలక నిలయం.. విస్తరణ పరిధి ఇదే

ఈ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన 'బే సిటీ' (Bay City)ని ప్రధాన కేంద్రంగా (Anchor) మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బే సిటీ ప్రాజెక్టు అమలు కోసం ఒక ప్రత్యేక 'ఎగ్జిక్యూటివ్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

విఇఆర్ పరిధిని శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి రాజమండ్రిలోని ప్రతిపాదిత 'అఖండ గోదావరి' ప్రాజెక్టు వరకు విస్తరించాలని అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న నిధుల వినియోగంతో పాటు అవసరమైన చోట 'వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.

ప్రాధాన్యత రంగాలు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు

కీలక రంగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ టెక్నాలజీస్, ఎనర్జీ ప్రాజెక్టులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC), ఫిన్‌టెక్, లాజిస్టిక్స్.

టూరిజం డెవలప్‌మెంట్: విశాఖ జూలాజికల్ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం.

ప్రముఖ పెట్టుబడులు: ఇప్పటికే స్థిరపడిన గూగుల్ AI డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ వంటివి రీజియన్ ఇమేజ్‌ను మరింత పెంచాయని అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe