ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్క్ - నిర్మాణ పనులపై కీలక ఆదేశాలు

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. దశలవారీగా పనులను పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 

Published on: Jan 9, 2026, 10:07:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటిదశలో 55 ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 16 ప్రారంభం కాగా మరో 39 పార్కులకు శంఖుస్థాపన చేశారు.

ఎంఎస్ఎంఇ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తేవాలి:సీఎస్
ఎంఎస్ఎంఇ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తేవాలి:సీఎస్

త్వరితగతిన పూర్తి చేయాలి - సీఎస్ ఆదేశాలు

ఎంఎస్ఎంఇ పార్కు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి… నిర్మాణ పనులపై ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు.

దశలవారీగా ఏర్పాటు…

2వ దశ కింద 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3 ప్రారంభించామని సీఎస్ పేర్కొన్నారు. మరో 42 పార్కులకు శంఖుస్థాపన జరిగిందని అన్నారు. మూడవ దశ కింద ఈనెలాఖరు లోగా 75 ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా 6 పార్కులకు అవసరమైన భూమి ఎపిఐఐసికి అప్పగించినట్లు తెలిపారు. మిగతా వాటికి సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని… ఆప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులను అందుబాటులోకి తెచ్చేలా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశిచాంరు.

విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు-2025లో వివిధ సంస్థలు, కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలకు సంబంధించిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఇటీవల జరిగిన జిల్లా కలక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల అమలుకు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మాట్లాడుతూ జిల్లాల వారీ ఎంఎస్ఎంఇ పార్కుల ప్రగతిని వివరించారు.ఈపార్కులు ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తింపు వేగవంతంగా పనులు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.అన్నిజిల్లాలోను జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్సు ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి ఆసమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More