ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూనే.. మరోవైపు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 51 పట్టణ స్థానిక సంస్థలలో(ULBs) 'స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్' (వీధి వ్యాపార ప్రణాళికలు) అమలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా వీధి వ్యాపారుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు.. నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల భద్రత మెరుగుపడనున్నాయి.

'వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం-2014' ప్రకారం.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పరిధిలోకి మూడు నగరపాలక సంస్థలు (కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం), 48 మున్సిపాలిటీలు వస్తాయి. ఇందులో భీమవరం, హిందూపూర్, గుంతకల్, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం, పిఠాపురం, సామర్లకోట, నూజివీడు, వినుకొండ, పలాస-కాసిబుగ్గ, బొబ్బిలి, రాజంపేట, కదిరి, కనిగిరి, గూడూరు, గిద్దలూరు వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూనే, పట్టణాలను క్రమబద్ధంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ ప్లాన్ ద్వారా పట్టణాల్లో వెండింగ్ జోన్స్, నియంత్రిత వెండింగ జోన్స్, నో వెండింగ్ జోన్స్ స్పష్టంగా గుర్తిస్తారు. దీనివల్ల వీధి వ్యాపారులు అధికారులు లేదా ఇతరుల నుంచి ఎలాంటి ఆకస్మిక తొలగింపుల భయం లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.
అదే సమయంలో రహదారులు, ఫుట్పాత్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. వీధి వ్యాపారులు కేవలం తాత్కాలిక, సులభంగా తొలగించగలిగే స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి శాశ్వత కట్టడాలు నిర్మించకూడదు.
వ్యాపారాల వల్ల ట్రాఫిక్కు, పాదచారుల రాకపోకలకు, అత్యవసర సేవల (అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటివి) వాహనాలకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకూడదు. వ్యాపారం చేసుకునే పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వ్యాపారులదే.
{{/usCountry}}వ్యాపారాల వల్ల ట్రాఫిక్కు, పాదచారుల రాకపోకలకు, అత్యవసర సేవల (అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటివి) వాహనాలకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకూడదు. వ్యాపారం చేసుకునే పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వ్యాపారులదే.
{{/usCountry}}మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు అమలు చేయడానికి వీలుగా ఈ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి 'టౌన్ వెండింగ్ కమిటీల'తో సంప్రదింపులు జరిపి ఈ ప్లాన్ను అప్డేట్ చేయాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. ఈ వ్యాపార ప్రణాళికలను పట్టణాల మాస్టర్ ప్లాన్స్తో కూడా అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించిన ప్లాన్స్ కూడా సిద్ధమవుతున్నాయని, వాటిని త్వరలోనే విడతల వారీగా నోటిఫై చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.