ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు చొరబడటం, అక్రమంగా చేపలు పట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తమిళనాడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్.. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు మత్స్య పడవలు మరింతగా ప్రవేశించకుండా నిరోధించడానికి తక్షణ జోక్యం, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తమిళనాడు మత్స్య మరియు మత్స్యకారుల సంక్షేమ డైరెక్టర్కు ఒక లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన యంత్ర చేపల పడవల అనధికారిక ప్రవేశం నిరాటంకంగా కొనసాగుతోందని, ఇది స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా ఉందని ఏపీ లేఖలో పేర్కొంది. రాష్ట్రాల మధ్య అమలులో ఉన్న నియంత్రణ వ్యవస్థను కూడా ఇలా రావడం బలహీనపరుస్తోందని తెలిపింది. తమిళనాడులో యంత్ర పడవల ద్వారా జరిగే అక్రమ చేపల వేట తీవ్రమైన శాంతిభద్రతల ఆందోళనలను కూడా సృష్టించిందని మత్స్యశాఖ కమిషనర్ రాశారు.
తమిళనాడుకు చెందిన పడవల ద్వారా జరుగుతున్న అక్రమ ప్రవేశం, అక్రమ చేపల వేట సమస్యలను పరిష్కరించడానికి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 2022, 2023, 2025 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఇలాంటి లేఖలే రాశారని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పేర్కొన్నారు.
మార్చి 18న ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో జరిగిన సంఘటనను మత్స్యశాఖ కమిషనర్.. తమిళనాడు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న నాలుగు చేపల పడవలను పుదుచ్చేరికి చెందిన మత్స్యకారులు తీసుకువెళ్లారు. ఈ చర్య శాంతిభద్రతల తీవ్ర ఉల్లంఘన అని, ఇది చట్టాన్ని అమలు చేసే సంస్థల అధికారాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు.
'ఈ సంఘటన తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 162 తీరప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. దీనిని వెంటనే పరిష్కరించకపోతే, ఇది రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.' అని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ లేఖలో పేర్కొన్నారు.
{{/usCountry}}'ఈ సంఘటన తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 162 తీరప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. దీనిని వెంటనే పరిష్కరించకపోతే, ఇది రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.' అని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ లేఖలో పేర్కొన్నారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లో తమిళనాడు నౌకలు విధ్వంసకరమైన చేపల వేట పద్ధతులను, ముఖ్యంగా ట్రాలింగ్ను కొనసాగించడం వల్ల గణనీయమైన పర్యావరణ నష్టం జరుగుతోందని తమిళనాడు అధికారులకు మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ తెలియజేశారు. ఈ కార్యకలాపాల వల్ల తాబేళ్లు, ఇతర అంతరించిపోతున్న సముద్ర జీవుల మరణాలు పెరుగుతున్నాయన్నారు. వాటి కళేబరాలు తరచుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి కొట్టుకొస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయని రామ శంకర్ నాయక్ లేఖలో రాశారు.