Andhra Pradesh Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదు కావడం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే కొత్తగా 7 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా వెలుగుచూసిన 7 కేసుల్లో గుంటూరు జిల్లా నుంచి నాలుగు, తూర్పు గోదావరి జిల్లా నుంచి రెండు, బాపట్ల జిల్లా నుంచి ఒక కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రమంతటా నమోదు కాబడిన మొత్తం 26 కేసులలో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగుచూశాయి.
జిల్లాల వారీగా కేసులు చూస్తే:
- కడప: 8
- గుంటూరు: 6
- తూర్పు గోదావరి: 3
- కాకినాడ: 2
- బాపట్ల: 2
వీటితో పాటు విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్ మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం…. రాష్ట్రంలో ఇప్పటివరకు 145 శాంపిళ్లను పరీక్షించారు. నమోదైన 26 మంది బాధితులలో 10 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటూ కోలుకుంటున్నారు. 3 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 4 మంది చికిత్స పొందుతూ మరణించారు.
ఆందోళన అవసరం లేదు : వైదారోగ్యశాఖ
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ…. కరోనా వల్ల మరణించిన నలుగురు రోగులూ ఇదివరకే తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్ర ముందస్తు సమస్యలు ఉండటంతో వారు కోలుకోలేకపోయారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ వైరస్ విస్తరిస్తోందా అన్న అనుమానాలపై స్పందిస్తూ….. ఈ కేసులు విడివిడిగా నమోదైనవి మాత్రమేనని.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ సమూహ వ్యాప్తి లేదా క్లస్టర్ అవుట్బ్రేక్ (Cluster Outbreak) జరగలేదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఎవరూ అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
{{/usCountry}}రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ వైరస్ విస్తరిస్తోందా అన్న అనుమానాలపై స్పందిస్తూ….. ఈ కేసులు విడివిడిగా నమోదైనవి మాత్రమేనని.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ సమూహ వ్యాప్తి లేదా క్లస్టర్ అవుట్బ్రేక్ (Cluster Outbreak) జరగలేదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఎవరూ అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
{{/usCountry}}